Cheapest Recharge Plans: ఎయిర్టెల్, విఐ, జియో జులై 3 నుంచి తమ అన్ని రీఛార్జ్ ప్లాన్ల టారిఫ్లను 11 నుంచి 25 శాతం పెంచాయి. మొబైల్ యూజర్లకు రీఛార్జ్ ప్లాన్లు చాలా భారంగా మారాయి. అంతేకాకుండా సిమ్కార్డ్ను యాక్టివ్గా ఉంచడం చాలా కష్టంగా తయారైంది. చాలా మంది తమ సిమ్ కార్డ్లను బీఎస్ఎన్లకు పోర్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ ప్రైవేట్ కంపెనీలు బడ్జెట్ ధరలో రీఛార్జ్ ప్లాన్లను ప్రకటించాయి. వీటి ద్వారా తక్కువ ధరకే మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
జియో
జియో తమ కస్టమర్ల కోసం 28 రోజుల వాలిడిటీ కోసం రూ.189 రీఛార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ప్రయోజనాల గురించి మాట్లాడితే 28 రోజుల పాటు 2 జీబీ డేటా ఇస్తోంది. దీంతో పాటు 300 ఎస్ఎమ్ఎస్లు లభిస్తాయి. మీరు 28 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ పొందొచ్చు. మీకు ప్రతి రోజూ డేటా అవసరం ఉండినట్లయితే కనీసం రూ.249 ప్లాన్ యాక్టివ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ డైలీ 1 జీబీ డేటా వస్తుంది. దీని వాలిడిటీ 28 రోజులు.
ఎయిర్టెల్
ఎయిర్ నెట్వర్క్ యూజర్లు తమ సిమ్ కార్డ్ యాక్టివ్గా ఉంచడానికి తక్కువ రీఛారజ్ ప్లాన్ రూ.199. ఈ ప్లాన్లో 28 రోజుల పాటు 2 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది.అంతేకాకుండా 300 ఎస్ఎమ్ఎస్లు అందిస్తున్నారు. 28 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ను ఎంజాయ్ చేయవచ్చు. అయితే మీకు డైలీ డేటా కావాలంటే మీరు రూ.299 రీఛార్జ్ ప్లాన్ యాక్టివ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఈ ప్లాన్లో డైలీ 1 జీబీ డేటా లభిస్తుంది. దీనితో పాటు డైలీ 100 ఎస్ఎమ్ఎస్లు వస్తాయి. ఇతర ప్లాన్ల మాదిరిగానే ఇందులో కూడా 28 రోజుల పాటు అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ ఉంటాయి.
Also Read: BSNL సూపర్ ప్లాన్.. జస్ట్ రూ.107 రీఛార్జ్.. 35 రోజుల వాలిడిటీ.. ఫుల్ ఎంజాయ్!
వొడాఫోన్ ఐడియా
విఐ సిమ్ని 28 రోజుల పాటు యాక్టివ్గా ఉంచడానికి రూ.199 రిఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్లో 2 జీబీ డేటా అందుబాటులో ఉంటుంది. దీని వాలిడిటీ 10 రోజులు. ఈ ప్లాన్లో కంపెనీ 28 రోజుల పాటు 300 ఎస్ఎమ్ఎస్లు అందిస్తోంది. అలానే అన్లిమిటెడ్ కాలింగ్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే మీరు హైలీ ఇంటర్నెట్ యూజర్లైతే రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ లభించే బెనిఫిట్స్ గురించి మాట్లాడితే మీరు ప్రతి రోజూ 1 జీబీ డేటా పొందుతారు. ప్రతి రోజూ 100 ఎస్ఎమ్ఎస్లు వస్తాయి. అన్లిమిటెడ్ కాలింగ్ పొందుతారు. ఈ ప్లాన్ 28 రోజుల పాటు యాక్టివ్గా ఉంటుంది.