Tirumala Hill: తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం వేలాది లేదా లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడుతుంది. నిత్యం కొండ మీదికి భక్తులు వస్తూనే ఉంటారు. తిరుపతికి వెళ్లాక కేవలం శ్రీవారి దర్శనంతో సరిపెట్టుకోకుండా చుట్టుపక్కల ఉన్న ఇతర దైవ క్షేత్రాలను కూడా దర్శించి మొక్కులు సమర్పించుకుంటారు. ఇలాగే ఓ యువతి తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయ స్వామి దర్శనం కోసం వెళ్లుతుండగా తీవ్ర ప్రమాదానికి గురైంది.
దర్శనం కోసం వెళ్లుతుండగా.. ఆలయ ముఖ ద్వారానికి సమీపానికి వచ్చాక హఠాత్తుగా ఓ పెద్ద చెట్టుకొమ్మ విరిగి ఆమె పై పడింది. ఆ కొమ్మ నేరుగా ఆమె తలపై పడింది. దీంతో క్షణాల్లోనే ఆమె నేలపై కూలపడిపోయింది. ఆమె పక్కనే ఉన్న వ్యక్తి మాత్రం అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదానికి గురికాలేదు. ఆమె భక్తిలో దైవ దర్శనానికి వెళ్లుతుండగా మార్గమధ్యంలోనే పైనుంచి పెద్ద కొమ్మ వచ్చి పడటం అందరినీ ఆందోళనలోకి నెట్టేసింది. ఈ ఘటనను తోటి భక్తులు వీడియో తీశారు.
Freak accident at #Tirumala as Devotee Seriously Injured after Tree Branch Falls at Japali Theertham
The incident occurred when the devotee was standing near temple entrance, and a branch suddenly broke off and fell on her. Temple staff rushed her to the hospital immediately. pic.twitter.com/8A9tXYjxfM
— Apoorva Jayachandran (@Jay_Apoorva18) July 12, 2024
ఈ దెబ్బతో సదరు యువతికి తలకు, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే హాస్పిటల్ తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతున్నది. ఆమె వివరాలు ఏమిటన్నవి ఇంకా తెలియరాలేవు. అయితే, భీతి గొల్పుతున్న ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఈ ఘటనపై నెటిజన్లు స్పందిస్తూ.. ఇది కర్మ సిద్ధాంతానికి సంబంధించిన చర్య అని పేర్కొంటుండగా.. ఆలయ దేవస్థానం మెయింటెనెన్స్ సరిగా చేయకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. చాలా మంది ఆమె క్షేమాన్ని కోరుతూ కామెంట్లు చేశారు.