Anant Radhika Wedding: బిలియనీర్ ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో రాత్రి 9.30 గంటలకు అనంత్ అంబానీతో రాధికా మర్చంట్ వివాహం జరగనుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు, హల్దీ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ప్రపంచంలో కనివిని ఎరుగని రీతిలో అనంత్, రాధికల వివాహం జరుగుతుంది. ఈ వేడుకకు దేశంలోని ప్రముఖులు, విదేశాల నుంచి కూడా పలువురు సెలబ్రిటీలు తరలివస్తున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ తారలు వందల సంఖ్యలో ముంబైకు చేరుకున్నారు.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ల వివాహానికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా ఆహ్వానం అందింది. మరోవైపు బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రముఖ సెలబ్రిటీ కిమ్ కర్దాషియాన్ ఇప్పటికే అనంత్ పెళ్లి వేడుకలకు ముంబై చేరుకున్నారు. మరోవైపు విదేశాల నుంచి వేల సంఖ్యలో సెలబ్రిటీలు విచ్చేస్తున్నారు. ప్రముఖ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ సీఈఓ హాన్ జోంగ్-హీ కూడా ముంబై చేరుకున్నారు. ఇక అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, శివరాజ్ సింగ్ చౌహాన్, ఆధిత్యా థాకరే, ఉద్దవ్ థాకరే కూడా వివాహానికి విచ్చేయనున్నారు.
వీరితో పాటు ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా నేడు ముంబైకు చేరుకోనున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీల్లో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రణ్ వీర్ సింగ్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్, విక్కీ కౌశల్, రణ్ బీర్ కపూర్ తమ ఫ్యామిలితో కలిసి వివాహానికి ఇప్పటికే విచ్చేశారు. ప్రముఖ క్రికెటర్లు మహెంద్ర సింగ్ ధోని, డేవిడ్ బెక్ హామ్, పాండ్య, రోహిత్ శర్మ వంటి ప్రముఖులు విచ్చేసి సందడి చేయనున్నారు.