Tipper hit Bus: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోలార్ సమీపంలోని నర్సాపూర్ వద్ద బుధవారం రాత్రి బస్బును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 15 మందికి పైగా తీవ్రగాయాలు అయ్యాయి.
టిప్పర్ వేగానికి బస్సు ముందుపార్టు నుజ్జునుజ్జు అయ్యింది. ప్రైవేటు ట్రావెల్ బస్సు బెంగుళూరు నుంచి తిరుపతి వెళ్తోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుంది. బస్సులో చిక్కు కున్నవారిని పోలీసులు బయటకు తీశారు.
వారిని వెంటనే అంబులెన్సులో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఘటన తర్వాత టిప్పర్ అక్కడే ఉంచి డ్రైవర్ ఎస్కేప్ అయినట్టు తెలుస్తోంది. వాహనాలను పక్కకు తొలగించిన పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
ALSO READ: పార్లమెంట్ లో ప్రతిధ్వనిస్తున్న రాహుల్ రింగ్‘టోన్’
మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. టిప్పర్ ఎవరిది? అనేదానిపై డీటేల్స్ సేకరిస్తున్నారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోలార్ సమీపంలోని నర్సాపూర్ వద్ద బుధవారం రాత్రి బస్బును టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా.. 15 మందికి పైగా గాయాలు అయ్యాయి. బెంగుళూరు నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాాదం జరిగింది.… pic.twitter.com/6RzQQb6KDf
— BIG TV Breaking News (@bigtvtelugu) July 12, 2024