IAS Officers transferred in AP(Latest news in Andhra Pradesh): ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మొత్తం 19 మంది ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా వీరితోపాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేశారు.
- స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శిగా – ఆర్పీ సిసోడియా
- అటవీ, పర్యావరణ, శాస్త్రసాంకేతిక ప్రత్యేక సీఎస్ గా – అనంతరాము
- సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ గా – జి. జయలక్ష్మి
- ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శిగా – కాంతిలాల్ దండే
- పెట్టుబడులు మౌలిక సదుపాయాల కార్యదర్శిగా – సురేశ్ కుమార్ (గ్రామవార్డు సచివాలయం పూర్తి అదనపు బాధ్యతలు)
జీఏడీ కార్యదర్శిగానూ సురేశ్ కుమార్ కు అదనపు బాధ్యతలు
- ఐటీ శాఖ, ఆర్టీజీఎస్ కార్యదర్శిగా – సౌరభ్ గౌర్
- పరిశ్రమలు, వాణిజ్యం, పుఢ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శిగా – యువరాజ్
- మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా – హర్షవర్ధన్
- వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ కార్యదర్శిగా – పి. భాస్కర్ (ఈడబ్ల్యూఎస్, జీఏడీ సర్వీసెస్ అదనపు బాధ్యతలు)
- సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా – కె. కన్నబాబు (గిరిజన సంక్షేమం, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గానూ బాధ్యతలు)
- పర్యాటకశాఖ కార్యదర్శిగా – వినయ్ చంద్
- యువజన సర్వీసులు, క్రీడలశాఖ కార్యదర్శిగా – వివేక్ యాదవ్
- మహిళా, శిశుసంక్షేమం, దివ్యాంగుల సంక్షేమ కార్యదర్శిగా – సూర్యకుమారి
- ఇండస్ట్రీస్ డైరెక్టర్ గా – సి. శ్రీధర్
- ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శిగా – జె. నివాస్
- పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ గా – విజయరామరాజు
- సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా – హిమాంశు శుక్లా
- వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా – ఢిల్లీరావు
- వ్యవసాయ శాఖ నుంచి హరికిరణ్ బదిలీ
- ఆర్థిక శాఖ నుంచి గిరిజాశంకర్ బదిలీ
Tags
Share