West Bengal Bomb Blast : పశ్చిమ్ బెంగాల్లో పేలుడు కలకలం రేపింది. టీఎంసీ నేత ఇంటి వద్ద పేలుడు సంబంధించింది. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా ధ్వంసం అయింది. ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తోంది. పుర్బాలోని అర్జున్ నగర్లో టీఎంసీ పార్టీ బూత్ ప్రెసిడెంట్ రాజ్కుమార్ మన్నా ఇంటి వద్ద ఈ బ్లాస్ట్ జరిగింది. ఐతే పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. టీఎంసీ పార్టీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ.. ఇవాళ ఎన్నికల ర్యాలీ ఉన్న నేపథ్యంలో బ్లాక్ చోటు చేసుకోవడం కలకలం రేపింది. ఉగ్ర కుట్రనా లేక ఇంకేమైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు