Tirumala Darshan : ధర్మమార్గంలో నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ భగవంతుడిని చేరుకోవడమే మెట్లోత్సవం అంతరార్థం. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం గురువారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు. శక్తివంచన లేకుండా భక్తితో ప్రయత్నిస్తే భగవంతుని అనుగ్రహం తప్పక కలుగుతుందన్నారు. బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలం వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహించారు. 43 ఏళ్ల కిందట ఏర్పడిన దాస సాహిత్య ప్రాజెక్ట్ గత 35 ఏళ్లుగా మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోంది. కరోనా రెండేళ్లు మినహా అన్ని ఏళ్లు ఈ మెట్లోత్సవ వైభవంగా జరుగుతోంది. కాలినడకన శ్రీవారిని దర్శించుకోవడం తిరుగిరుల ప్రత్యేకతని దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు తెలిపారు. గతంలో పురందరదాసులు, వ్యాస రాజయతీశ్వరులు, అన్నమాచార్యులు, శ్రీకృష్ణ దేవరాయలు లాంటి మహనీయులు కాలి నడకన స్వామిని దర్శించి ఆశీస్సులు పొందారు