Neha Shetty: డైరెక్టర్ పూరి జగన్నాధ్ పరిచయం చేసిన హీరోయిన్స్ లో నేహా శెట్టి ఒకరు. పూరి కొడుకు ఆకాష్ పూరి నటించిన మెహబూబా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది నేహా.
మొదటి సినిమా నేహశెట్టికి ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయింది. అయినా అమ్మడికి అవకాశాలను అయితే అందించింది.
మెహబూబా తరువాత నేహా శెట్టి గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి చిత్రాల్లో కనిపించింది. ఇవి కూడా అమ్మడికి ఎలాంటి విజయాన్ని అందివ్వలేకపోయాయి.
ఇక 2022 లో డీజే టిల్లు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా నేహా శెట్టి జీవితాన్నే మార్చేసింది. రాధికా పాత్రలో అమ్మడి నటనకు ఫిదా కానీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు.
డీజే టిల్లు తరువాత నేహా కాస్తా రాధికగా మారిపోయింది. ఆమె ఎక్కడకు వెళ్లినా రాధికా అనే పిలవడం మొదలుపెట్టారు.
టిల్లు స్క్వేర్ లో కూడా రాధికా ఎంట్రీ ఏ రేంజ్ సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక డీజే టిల్లు తరువాత నేహా వరుస అవకాశాలను అందుకుంటుంది. బెదురు లంక, రూల్స్ రంజన్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాల్లో కనిపించింది.
సినిమాలతో పాటు నేహా శెట్టి సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తోంది. అమ్మడి అందాల ఆరబోతకు సపరేట్ ఫ్యాన్ బేస్ నే ఉంది.
నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ షేర్ చేసి కుర్రాళ్లకు కునుకే లేకుండా చేస్తోంది నేహా శెట్టి.
తాజాగా నేహా ఫోటోషూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వైట్ కలర్ డిజైనర్ బ్రా లో అమ్మడు అందాల ఆరబోత చేస్తూ కనిపించింది.
ఎద అందాలను ఆరబోసి.. సన్నని నడుమును ఎరవేసి.. మత్తెక్కించే కళ్లతో ఫోటోలకు ఫోజులిచ్చింది.
బెడ్ పై బోర్లా పడుకొని నడుమును ఎలివేట్ చేసి.. కుర్రకారుకు కునుకు రాకుండా కళ్లతోనే చంపేస్తుంది నేహా శెట్టి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.