EPAPER

Blast in Firecrakers Factory : శివకాశీ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి

Blast in Firecrakers Factory : శివకాశీ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు.. ఇద్దరు మృతి

Blast in Firecrackers manufacturing Factory(Today’s news in telugu): తమిళనాడులోని విరుదునగర్ జిల్లా శివకాశిలో మరోసారి బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. కలయార్ కురిచ్చిలోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలవ్వగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఫైరింజన్లతో ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మృతులను మరియప్పన్, ముత్తువేల్ గా గుర్తించారు.


కాగా.. గత నెల 29న విరుదునగర్ జిల్లా సత్తూర్ కు సమీపంలోని బందువార్ పట్టిలో గల బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరిగింది. పేలుడు ధాటికి బాణసంచా కేంద్రమంతా నేలమట్టమవ్వగా.. నలుగురు సజీవదహనమయ్యారు. 10 రోజుల వ్యవధిలో మరో ప్రమాదం జరగడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. శివకాశీలో తరచూ బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లు జరుగుతుంటాయి.


Tags

Related News

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×