ఆయన డిప్యూటేషన్ ను రేపు ఆమోదించే అవకాశం ఉంది. మూడేళ్ల పాటు ఏపీలో ఉండేందుకు అనుమతి ఇచ్చింది. కొత్త ప్రభుత్వం రాగానే రాజమౌళిని తమ రాష్ట్రానికి కేటాయించాలంటూ డీవోపీటికి, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో కేంద్రం ఆయనను డిప్యుటేషన్పై పంపించేందుకు అంగీకరించింది.
Also Read: జగన్ వల్లే ఓడిపోయా.. కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు..
రాజమౌళి గత టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో డిప్యుటేషన్ పై పని చేశారు. రాజమౌలి రాకతో సీఎంవో అధికారులు సంఖ్య నాలుగుకు చేరింది. మరోవైపు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వనతితో ఏపీకి రాబోతున్నారు కృష్ణతేజ. కేరళ ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేసేందుకు ఆమోదం తెలిపింది. కేంద్రం కూడా కృష్ణతేజను ఏపీకి పంపించేందుకు ఒప్పుకుంది. దీనికి సంబంధించి రేపు అపాయింట్స్ మెంట్ కమిటీ ఆమోదం తెలుపనుంది. కృష్ణతేజ బుధ,గురు వారాల్లో ఏపీలో రిపోర్ట్ చేస్తారు. డిప్యూటీ సీఎం కీలక అధికారిగా ఆయన కొనసాగనున్నారు.