A young Man Stabs Minor Girl To Death In Anakapalli: అనకాపల్లి జిల్లాలో ప్రేమోన్మాది దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమను నిరాకరించందని దర్శిని అనే మైనర్ బాలికపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేశాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటన అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండు పాలెంలో చోటు చేసుకుంది. ఇంట్లోకి చొరబడి కత్తితో అతి దారుణంగా గొంతు కోసి పరారయ్యాడు. సంఘటన స్థలంలోనే నిందితుడు సురేష్ కత్తి వదిలేసి పరారయ్యాడు.
సంవత్సరకాలంగా ప్రేమ పేరుతో బాలిక దర్శినిని వేధింపులకు గురి చేస్తున్నాడు సురేశ్. బాలిక ఒప్పుకోకపోవడంతో మరింత టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. దీంతో బాలిక తల్లి దండ్రులకు చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేవారు. సురేష్పై ఫోక్సో కేసు పెట్టారు. అప్పటినుంచి జైల్లోనే ఉన్న సురేశ్.. ఎన్నికల ముందే బెయిల్ పై బయటకు వచ్చాడు. అప్పటినుంచి బాలికపై కక్ష కట్టిన సురేశ్.. ఎవరూ లేని సమయంలో దర్శినిపై కత్తితో దాడి చేసి విచక్షణారహితంగా హత్య చేసి పరార్యయాడు.
Also Read: తాగుడుకి బానిసైన భర్త.. స్క్రూడ్రైవర్ తో పొడిచి చంపిన భార్య
దర్శిని హత్యపై స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. హత్య చేసిన సురేష్ను వెంటనే పట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో దర్శిని ఇంటి వద్దన క్లూస్ టీమ్స్ ఆధారాలు సేకరించింది. హత్య చేసిన సురేష్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.