Xiaomi SU7: గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ కస్టమర్లలో ఎలక్ట్రిక్ సెగ్మెంట్ (EV) కార్ల డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో టాటా మోటార్స్ పూర్తి ఆధిపత్యాన్ని కలిగి ఉంది. దేశంలో ఈ EV మొత్తం ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలలో 65 శాతం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. టాటా నెక్సాన్ EV, టాటా పంచ్ EV, టాటా టియాగో EV, టాటా టిగోర్ EVలు ఈ విభాగంలో చాలా పాపులర్ అయింది.
ఇప్పుడు చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ షియోమీ ఈ సెగ్మెంట్లో ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ కారు SU7 ను భారతదేశంలోని బెంగళూరులో ప్రదర్శించబోతోంది. కంపెనీ త్వరలో భారతదేశంలో Xiaomi SU7 ను ప్రారంభించవచ్చని అనేక మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. కంపెనీ ప్లానింగ్, కార్ బ్యాటరీ, డ్రైవింగ్ రేంజ్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Also Read: మార్కెట్లో CNG కార్ల జోరు.. అసలు మ్యాటర్ బయటపడింది!
ఈ కారు టెస్లా మోడల్ 3తో పోటీపడుతుంది. ప్రస్తుతం భారతదేశంలోని అతిపెద్ద స్మార్ట్ఫోన్ విక్రయ కంపెనీలలో షియోమీ ఒకటి. అయితే బెంగళూరులో జరిగే వేడుకలో పలు కొత్త కార్లను వివిధ కేటగిరీల్లో విక్రయించనున్నట్లు సమాచారం. వీటిలో కంపెనీకి చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కారు SU7 కూడా ఉంది. దీనితో కంపెనీ తన ఇంజనీరింగ్, మాన్యుఫాక్చరింగ్ పవర్ స్మార్ట్ఫోన్లకు మాత్రమే చెందకుండా వివిధ విభాగాలలో ప్రదర్శించాలనిా భావిస్తోంది.
చైనాలో, Xiaomi SU7 నేరుగా టెస్లా మోడల్ 3తో పోటీ పడుతుంది. ఇది ఇటీవలి కాలంలో ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా మారింది. Xiaomi SU7ని భారతదేశంలో విడుదలైనట్లయితే ఈ కారు నేరుగా BYD సీల్తో పోటీపడుతుంది. దీని ధర కూడా అదే స్థాయిలో ఉండవచ్చు.
Also Read: టాటా పంచ్ EV వర్సెస్ CNG.. రెండిటిలో ఏది బెటర్.. ప్రైస్ ఎంత?
కారు పొడవు 4,997 మిమీ, వెడల్పు 1,963 మిమీ, ఎత్తు 1,455 మిమీగా ఉంటుంది. అయితే దీని వీల్ బేస్ 3,000 మిమీ. ఈ ఎలక్ట్రిక్ కారులో 517 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. కంపెనీ భారతదేశంలో టాప్-స్పెక్ Xiaomi SU7 మాక్స్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ను లాంచ్ చేయనుంది. ఇందులో 101kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 800 కిలోమీటర్ల రేంజ్ అందిస్తోంది. కారు గరిష్ట వేగం గంటకు 265 కిలోమీటర్లు ఉంటుంది.