Telangana Maoists : తెలంగాణ ఏజెన్సీలో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. ఇవాల్టి నుంచి పీపుల్స్ లి లేబరేషన్ గెరిల్లా ఆర్బి వారోత్సవాలకు పిలుపునివ్వడంతో.. పోలీసులు పూర్తిగా అలర్ట్ అయ్యారు. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే భూపాల్ పల్లి జిల్లా తూర్పు డివిజన్ లో తనిఖీలు ముమ్మరం చేశారు. మావోయిస్టులు గ్రామాల్లో అడుగు పెట్టకుండా చేసేందుకు .. పకడ్బందీ గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
గ్రామాల్లో సభలు సమావేశాలకు సన్నాహాలు చేస్తుండడంతో.. అడవి సరిహద్దు గ్రామాల ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని సూచిస్తున్నారు. తూర్పు డివిజన్లోని మహా ముత్తారం, మహాదేవపూర్, మల్హర్, పలిమలలో మండలాల్లో ముందస్తు జాగ్రత్తగా హై అలర్ట్ ప్రకటించారు . మావోయిస్టుల టార్గెట్ లో ఉన్న నాయకులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.