Huge discussion on social Media over Jagan Resignation: ఏపీ ఎన్నికల్లో ఘోరంగా అపజయాన్ని చవిచూసిన మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ తీవ్ర నిరాశలో ఉన్న విషయం తెలిసిందే. 175 సీట్లకు 175 సీట్లు వస్తాయంటూ ఆశ పెట్టుకున్న జగన్ కు ఎన్నికల్లో భారీ షాక్ ఎదురయ్యింది. అన్ని సీట్లు కాదు కదా కనీసం ప్రతిపక్ష హోదాకు రావాల్సిన సీట్లు కూడా రాలేదు. 11 సీట్లు మాత్రమే వైసీపీకి వచ్చాయి. ఈ క్రమంలో జగన్ నిరాశలో ఉన్నారు. ఇది ఇలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో జగన్ కు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే పదవికి జగన్ రాజీనామా చేయబోతున్నారంటూ భారీగా ప్రచారం జరుగుతుంది.
10 మంది ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వెళ్లడం ఇష్టం లేక రాజీనామా చేయడానికి ఆసక్తి చూపుతున్నారని నెటిజన్స్ డిస్కర్షన్ చేస్తున్నారంటా. ప్రతిపక్ష హోదా లేకపోవడం, ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడంతో ఈ దిశగా జగన్ నిర్ణయం తీసుకున్నారంటూ నెటిజన్స్ చర్చిస్తున్నారంటా.
కడప ఎంపీ స్థానానికి అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఆ స్థానం నుంచి జగన్ పోటీ చేస్తారంటూ నెటిజన్స్ లెక్కలు వేస్తున్నారంట. కడప ఎంపీ, పులివెందుల ఎమ్మెల్యే సీట్లలోనూ వైసీపీ ఓడిపోవొచ్చంటూ అంచనాలు కూడా వేస్తున్నారంట. మరి జగన్ నిజంగానే ఆ దిశగా చర్చిస్తున్నారా లేదా? అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.
Also Read: భలే జోకులేస్తున్నారు బొత్స గారు.. జనం నవ్వుతారు.. వద్దులెండీ: అచ్చెన్నాయుడు
ఇదిలా ఉంటే.. రిమ్స్ లో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్తను జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా చెడు సంప్రదాయానికి సీఎం చంద్రబాబు నాంది పలికారన్నారు. శిశుపాలుడి పాపాల మాదిరిగా ఆయన పాపాలు పండుతున్నాయన్నారు. అధికారం మారిన రోజున.. ఆ పాపాలు తన చుట్టుకుంటాయని బాబు గుర్తించాలంటూ మండిపడ్డారు.
రైతు భరోసా, నిరుద్యోగ భృతి ఏమైందంటూ చంద్రబాబును ప్రశ్నించారు. దాడులపై కాదు.. ఇచ్చిన హామీలపై దృష్టిసారించాలంటూ హితవు పలికారు.