Salman’s Sikandar film updates: సల్మాన్ఖాన్- డైరెక్టర్ మురుగదాస్ కాంబోలో రానున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ సికిందర్. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో హీరోయిన్ రష్మిక మందన్నా కాగా, బాహుబలి కట్టప్ప సత్యరాజ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.
ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుగుతోంది. సత్యరాజ్పై కీలక సన్నివేశాలను తెరకెక్కించాడు డైరెక్టర్ మురుగదాస్. అనుకున్న దానికంటే సన్నివేశాలు బాగా రావడంతో డైరెక్టర్ ఫుల్ఖుషీగా ఉన్నాడు. తొలి షెడ్యూల్లో సల్మాన్కు పార్ట్ పూర్తయ్యింది. ఆ సన్నివేశాల్లోనే కట్టప్ప కనిపించనున్నాడు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించి సెకండ్ షెడ్యూల్ ఆగష్టు నుంచి మొదలుకానుంది. మేజర్ పార్ట్ అంతా యూరప్లో షూట్ చేయనున్నారు. దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ ఉండబోతోంది. లోకేషన్ రెడీ కావడంతో ఈ మంత్ ఎండింగ్ యూరప్కు వెళ్లాలని యూనిట్ ప్లాన్ చేస్తోంది.
సాజిద్ నడియావాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరో నటుడు సునీల్శెట్టి క్రూషియల్ రోల్ చేయనున్నాడు. ఈ సినిమాపై అప్పుడే ఇండస్ట్రీలో మాంచి హైప్ క్రియేట్ అయ్యింది. లాంగ్ బ్రేక్ తర్వాత మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్టు ఇది. దాదాపు 400 కోట్ల రూపాయలతో దీన్ని తెరకెక్కిస్తున్నట్లు అంతర్గత సమాచారం.
అంతా అనుకున్నట్లు జరిగితే ఈద్ సందర్భంగా వచ్చే ఏడాది రిలీజ్ చేయాలన్నది మేకర్స్ చెబుతున్న మాట. సల్మాన్కు ఓ సెంటిమెంట్ ఉంది. తన సినిమాలను ఫెస్టివల్ సమయంలో రిలీజ్ చేస్తే హిట్ అవుతుందని నమ్మకం. అందుకే మేకర్స్ ఆ డేట్ ఫిక్స్ చేసినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ALSO READ: జక్కన్నపై డాక్యుమెంటరీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
టైగర్ 3 మూవీ తర్వాత సల్మాన్ ఏ ఫిల్మ్ చేయలేదు. అలాగే రష్మిక తొలిసారి స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది. నార్మల్గా ఈ ప్రాజెక్టు చర్చలు మార్చిలో సల్మాన్తో జరిగాయి. ఆసక్తికరంగా ఉండడంతో వెంటనే పట్టాలకెక్కించాలని చెప్పాడట. మే చివరి నాటికి షూట్ మొదలుపెట్టాలని చెప్పడం, జూన్ నుంచి చిత్రీకరణ మొదలవ్వడం జరిగిపోయింది. రానున్న రోజుల్లో సికిందర్ గురించి ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.