Case Files on Kodali Nani & Vasudeva Reddy(Political news in AP): ఏపీ బీవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిలతా రెడ్డిలపై.. గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
2011లో పబ్లిక్ టెండర్ ద్వారా తన తల్లి సీతామహాలక్ష్మి పేరు మీద ఏపీ బేవరెజెస్ లిక్కర్ గోడౌన్ లైసెన్స్ పొందారు గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్. అయితే 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే.. పద్మారెడ్డి అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చడం కోసం తనను బెదిరించారని ప్రభాకర్ ఆరోపించారు.
Also Read: ఏపీలో హాట్ టాపిక్ గా ఉత్తరాంధ్ర రాజకీయం..
కొడాలి నాని అనుచరులు తన గోడౌన్ కు వచ్చి మద్యం బాటిల్లను ధ్వంసం చేసినట్లు ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక తమ లీజు అగ్రిమెంటు పూర్తవకుండానే మమ్మల్ని బెదిరించి గోదాములు ఖాళీ చేపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులతో అసభ్యకరంగా మాట్లాడారని, ఆ మనస్థాపంతో తన తల్లి మరణించిందని తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించాడు ప్రభాకర్. వైసీపీ నేతలు తనను బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాలని కోరాడు.