Swami Vivekananda Death Anniversary: ప్రతి ఏటా జూలై 4వ తేదీన దేశ వ్యాప్తంగా స్వామి వివేకానంద వర్ధంతిని జరుపుకుంటారు. స్వామి వివేకానంద జనవరి 12, 1863వ సంవత్సరంలో జన్మించారు. ఆయన భారతదేశపు ఓ గొప్ప ఆధ్యాత్మిక నాయకులు మరియు మేధావులలో ఒకరు. నరేంద్రనాథ్ దత్తగా జన్మించిన వివేకానంద భారతీయ ఆధ్యాత్మికవేత్త రామకృష్ణ యొక్క ప్రియమైన శిష్యుడు. యోగా, వేదాంతాలను పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసిన ఘనత వివేకానందకే దక్కుతుంది. వివేకానందను ఆధునిక భారతీయ జాతీయవాదానికి పితామహుడిగా పరిగణిస్తారు. 19వ శతాబ్దం చివరలో మతపరమైన అవగాహనను పెంపొందించడం మరియు హిందూమతాన్ని ప్రధాన ప్రపంచ మతంగా తీసుకువచ్చిన ఘనత కూడా ఆయనదే.
సెప్టెంబరు 11, 1893న చికాగోలోని ప్రపంచ మతాల పార్లమెంట్లో “అమెరికా సోదరీమణులు మరియు సోదరులారా” అని వివేకానంద చేసిన ప్రసంగం తర్వాత ప్రపంచానికి వివేకానంద ఎవరో తెలిసింది. ప్రపంచ వేదికలపై హిందూ మతం గురించి అవగాహన పెంచిన ఘనత కూడా వివేకానందదే. వివేకానందకి సైన్స్ మరియు మతంపై అపారమైన జ్ఞానం ఉంది.
వివేకానందుడు చిన్నతనంలోనే ఆధ్యాత్మికతపై ఆసక్తిని పెంచుకున్నాడు. అంతేకాదు హిందూ దేవతల విగ్రహాల ముందు ధ్యానం చేసేవాడు. అన్ని మతపరమైన మరియు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిని ప్రదర్శించాడు. రాజస్థాన్లోని చిన్న ప్రాంతమైన ఖేత్రీని పాలించిన మహారాజా అజిత్ సింగ్ కోరిక మేరకు అతను వివేకానంద అనే పేరును పొందాడు.
స్వామి వివేకానంద మరణం
స్వామి వివేకానంద ధ్యానంలో ఉండగా 1902 జూలై 4న కన్నుమూశారు. అతని శిష్యులు అతను మహా సమాధిని పొందారని నమ్ముతారు. వివేకానంద మెదడులోని రక్తనాళాల చీలిక కారణంగా మరణించారని చరిత్ర చెబుతుంది. తాను నలభై ఏళ్లు జీవిస్తానని వివేకానందుడు ముందే ఊహించాడు. పదహారేళ్ల క్రితం రామకృష్ణ అంత్యక్రియలు జరిపిన బేలూరులోని గంగా నది ఒడ్డున ఆయన అంత్యక్రియలు జరిగాయి.
స్వామి వివేకానందకు సంబంధించిన కొన్ని ముఖ్య సూక్తులు: