Rape Attempted Young Woman in Miyapur Hyderabad: స్త్రీల కోసం ఎన్ని భద్రతా చట్టాలు తీసుకొచ్చిన, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా మహిళలుపై దారుణాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లోని మియాపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతిపై కొంతమంది దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన యువతి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా వర్క్ చేస్తుంది. ఈ నేపథ్యంలో అదే కంపెనీలో వర్క్ చేస్తున్న జనార్దన్ రెడ్డి వెంచర్ చూపిస్తామని చెప్పి యువతిని తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న క్రమంలో మియాపూర్ సమీపంలో యువతికి మత్తుమందు ఇచ్చి, కారులోనే మరికొంత మందితో కలిసి అత్యాచారం చేశారు.
Also Read: తాగుడుకి బానిసైన భర్త.. స్క్రూడ్రైవర్ తో పొడిచి చంపిన భార్య
ప్రస్తుతం యువతిని వైద్య పరీక్షల నిమిత్తం కొండాపూర్ లోని ప్రభుత్వసుపత్రికి తరలించారు. యువతికి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకొని, పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు.