Ravindra Jadeja : ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జామ్నగర్లోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ప్రజలు అధిక సంఖ్యలో ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయాలని జడేజా కోరారు. మరోవైపు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేస్తున్న ఆయన తండ్రి అనిరుద్ధ్ సిన్హ్, సోదరి నైనా జడేజా కూడా జామ్నగర్ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లే ఉండడం..ప్రధాని మోదీ రాష్ట్రం కావడంతో ఈ ఎన్నికల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.