Nara Brahmani : బాలకృష్ణ కూతురు, నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి బైక్ రైడింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బ్రాహ్మణి బేసిక్గా ప్రొఫెషనల్ బైక్ రైడర్. బైక్ పై ఆమె స్టంట్స్ కూడా చేయగలదు. లద్దాక్ టూర్లో ఉన్న ఆమె జావా బైక్పై చేసిన రైడింగ్ స్టంట్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. వావ్ బ్రాహ్మణి.
ప్రముఖ రాజకీయ, సినీ కుటుంబం నుంచి వచ్చిన బ్రాహ్మణి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంటుంది. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్కి ఎక్జిక్యుటివ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్గా, బాలకృష్ణ కూతురిగా, లోకేష్ భార్యగా అందరికీ పరిచయం అయిన బ్రాహ్మణి ఇప్పుడు ప్రముఖ బైక్ రైడర్గా పేరు సంపాదించుకున్నారు.
బ్రాహ్మణి బైక్రైడింగ్ వీడియోను ప్రముఖ బైక్ జావా యెజ్డీ మోటర్సైకిల్స్ వారు యూట్యూబ్లో రిలీజ్ చేశారు. జావా బైక్తో బైక్ రైడింగ్ సూట్లో బ్రాహ్మణి మాట్లాడుతూ.. “ఉదయం లేహ్ నుంచి బైక్ రైడింగ్ చేస్తూ..థిక్సే మొనాస్టరీకి (బౌద్ధుల ఆశ్రమం) చేరుకుంటాం. అక్కడే టిఫిన్ చేసి మెడిటేషన్ చేస్తాం” అని బ్రాహ్మని చెబుతుంది. బ్రాహ్మణి బైక్ రైడింగ్ స్టంట్స్ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.