Samsung India Jobs : కంప్యుటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఐఐటీ పూర్తి చేసిన వారికి శామ్సంగ్ ఇండియాలో ఊహించని ప్యాకేజీలతో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సుమారు 1000 మందిని ఈ నోటిఫికేషన్ ద్వారా నియమించుకోనున్నట్లు శామ్సంగ్ ఇండియా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ మ్యానేజర్ వాద్వాన్ తెలిపారు. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, ఇనస్ట్రుమెంటేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్ నెట్వర్క్ క్యాటగరీల్లో ఈ నియామకాలు చేపట్టునున్నట్లు శామ్సంగ్ ఇండియా తెలిపింది.
దేశంలోని ప్రముఖ ఐఐటీ విద్యాసంస్థల ద్వారా 200 మందిని..ఇతర ప్రముఖ విద్యాలయాల ద్వారా 400 మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించారు. ప్యాకేజీ ఎంత వుంటదనే దానిపై స్పష్టమైన ప్రకటన విడుదల చెయ్యలేదు. అయితే శామ్సంగ్ ఇండియా ఇంజనీర్లకు ఇచ్చే పే ప్యాకేజీలు భారీగానే ఉంటాయని హెచ్ఆర్ నిపుణులు చెబుతున్నారు. ఆ ఏడాది చివర వరకు ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, 2023లో ఈ 1000 మందికి ఆఫర్లెటర్లను ఇవ్వనున్నట్లు శామ్సంగ్ ఇండియా తెలిపింది.