Kavitha: జైల్లో పెట్టుకోండి.. ఉరి వేస్తారా? భయపడేదేలే.. ఇంతకంటే ఎక్కువేం చేస్తారంటూ ఎమ్మెల్సీ కవిత సవాల్ చేశారు. ఎలాంటి విచారణనైనా ఎదుర్కొంటామన్నారు. మంత్రుల మీదా, తన మీద ఈడీ, సీబీఐ కేసులు పెట్టడం హీనమైన, నీచమైన రాజకీయ ఎత్తుగడ అంటూ మండిపడ్డారు కవిత.
ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. ఏడాది ముందు మోదీ కంటే ఈడీ వస్తుందని కవిత అన్నారు. తెలంగాణలో వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి.. మోదీకంటే ముందే తెలంగాణకు ఈడీ వచ్చిందన్నారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి గెలవాలనుకోవడం తెలంగాణలో సాధ్యం కాదని అన్నారు. ఏజెన్సీలు వచ్చి ప్రశ్నలు అడిగితే తప్పకుండా జవాబు చెబుతామని.. అంతేగానీ మీడియాలో లీకులిచ్చి దుస్ప్రచారం చేస్తే తిప్పికొడతామని మోదీని హెచ్చరించారు.