Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణలో కేసీఆర్ కూతురు కవిత పేరు రావడం.. ఏపీలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు చేర్చడం రాజకీయంగా కలకలం రేపుతోంది. అమిత్ అరోరాకు సౌత్ గ్రూప్ పేరుతో 100 కోట్లు ముట్టజెప్పారని.. ఆ మొత్తాన్ని శరత్ రెడ్డి, కవిత, మాగుంటలు అరేంజ్ చేసినట్టు రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది. దీంతో నెక్ట్స్ టార్గెట్ కవిత, మాగుంటలనే అంటున్నారు.
అయితే, ఢిల్లీ లిక్కర్ స్కాంతో తనకేం సంబంధం లేదంటున్నారు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. అసలు అమిత్ అరోరా ఎవరో తనకు తెలీనే తెలీదని చెబుతున్నారు. అతను నార్త్ ఇండియన్ వ్యాపారి.. అతనితో తామెందుకు వ్యాపారం చేస్తామని ప్రశ్నించారు. మాగుంట ఫ్యామిలీకి ఎలాంటి లిక్కర్ వ్యాపారాలు లేవని.. గతంలో చేసేవాళ్లం కానీ ఇప్పుడు మానేశామని చెబుతున్నారు. ఈ సందర్భంగా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు మాగుంట. దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర జరుగుతున్నట్టుగా ఆరోపణలు చేశారు.