Anupama Parameswaran : ఈ ఏడాది మీడియం బడ్జెట్ మూవీగా రూపొంది భారీ హిట్ మూవీగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం ‘డీజే స్క్వేర్’. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా టైటిల్ పాత్రలో నటించారు. సీక్వెల్ ఉంటుందని డీజే టిల్లు హిట్ అయిన సందర్భంలోనే మేకర్స్ అనౌన్స్ చేశారు. దీపావళి పండుగకి డీజే టిల్లు సీక్వెల్ ‘డీజే స్క్వేర్’ను అనౌన్స్ చేశారు. అయితే ఎవరూ ఊహించని రేంజ్లో అప్పుడే రెండు మార్పులు చేశారు. ఒకటి దర్శకుడిని మార్చేశారు. ఫస్ట్ పార్ట్ను డైరెక్ట్ చేసిన విమల్ కృష్ణ స్థానంలో మల్లిక్ రామ్ వచ్చాడు. ఇక రెండో మార్పు.. హీరోయిన్. నేహా శెట్టి స్థానంలో అనుపమా పరమేశ్వరన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు.
అయితే తాజా సమాచారం మేరకు డీజే స్క్వేర్ నుంచి అనుపమా పరమేశ్వరన్ కూడా వెళ్లిపోయింది. ఆమె స్థానంలో మడొన్నా సెబాస్టియన్ని ఎంపిక చేసుకున్నారు. అయితే ఉన్నట్లుండి అనుపమ స్థానంలో మరో హీరోయిన్ ఎందుక వచ్చిందనే దానిపై క్లారిటీ లేదు. మరి దీనిపై మేకర్స్ కానీ.. హీరో సిద్ధు జొన్నలగడ్డ కానీ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి. ఇక మడొన్నా సెబాస్టియన్ విషయానికి వస్తే.. తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన మడొన్నా సెబాస్టియన్.. తెలుగులో శ్యామ్ సింగరాయ్, ప్రేమమ్ చిత్రాల్లో నటించింది. డీజే స్క్వేర్ ఆమె నటించనున్న మూడో చిత్రం. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.