Shraddha Murder Case Update : శ్రద్ధా వాకర్ హత్య కేసులో రోజుకో విస్తుపోయే విషయం బయటపడుతోంది. శ్రద్ధాను అతి కిరాతకంగా హత్య చేసిన అఫ్తాబ్ అందుకు పశ్చాత్తాప పడటం లేదని పోలీసులు కనుగ్గొన్నారు. ఇటీవల పాలీగ్రాఫ్ టెస్ట్లో అఫ్తాబ్ తానే శ్రద్ధాను 35 ముక్కులుగా నరికి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. శ్రద్ధాను చంపినందుకు పశ్చాత్తాప పడుతున్నావా అన్న ప్రశ్నకు..అఫ్తాబ్ నుంచి లేదని సమాధానం వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
రేపు అంటే డిసెంబర్ 1న అఫ్తాబ్కు నార్కో అనాలసిస్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ లైడిటెక్టర్ టెస్ట్లో ఇంకా అనేక విషయాలు బయటపడనున్నట్లు తెలుస్తోంది.ఢిల్లీలోని ఓ లోకల్ కోర్ట్..ఈ నార్కో అనాలసిస్ టెస్ట్ చేయడానికి అనుమతినిచ్చింది. రెండు రోజులు డిసెంబర్ 1, డిసెంబర్ 5న రోహిణీ ల్యాబ్లో నార్కో అనాలసిస్ పరీక్షలను నిర్వహించనున్నారు.
శ్రద్ధాతో లివ్ ఇన్ రిలేషన్లో ఉన్న అఫ్తాబ్..శ్రద్ధాతో గొడవపడి మే 18న శ్రద్ధను గొంతునులిమి హత్య చేసి..ఆతరువాత 35 ముక్కలుగా నరికాడు. 18 రోజుల పాటు శ్రద్ధా బాడీ పార్ట్స్ను ఢిల్లీ మెహ్రౌలీ అడవి చుట్టు పక్కల ప్రాంతాల్లో పడేసాడు. శ్రద్ధ కనబడటం లేదని ఆమె తల్లి తండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. నవంబర్ 12 పోలీసులు అఫ్తాబ్ను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.