JC Prabhakar Reddy : జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చిది. 22.10కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేసింది. బస్సుల కొనుగోలు కేసులో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో గతంలో ఈడీ కేసు నమోదు చేసి విచారిస్తోంది. నకిలీ ఇన్వాస్ లు సృష్టించి బిఎస్ 4గా మార్చినట్టు గుర్తించింది ఈడీ.
ఆర్టీవో అధికారులతో నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసినట్టు ఈడీ ఆరోపణ. ఆ కేసు దర్యాప్తులో భాగంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. ఆయన అనుచరుడు గోపాల్రెడ్డి ఆస్తులను కూడా అటాచ్ చేసింది. వీటిలో దివాకర్ రోడ్లైన్స్, జటధా ఇండస్ట్రీస్, సి.గోపాల్ రెడ్డి అండ్ కో ఆస్తులు కూడా ఉన్నాయి.