IAS Transfers in Telangana State: తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్ ల బదిలీల ప్రక్రియను చేపట్టింది. ఈ నెల 15వ తేదీనే అన్ని జిల్లాలకు కలెక్టర్లను మార్చిన ప్రభుత్వం.. తాజాగా మరోసారి ఐఏఎస్ లను బదిలీ చేసింది. 44 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీఓ జారీ చేసింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న రొనాల్డ్ రోస్ ను ట్రాన్స్ కో సీఎండీగా బదిలీ చేసింది.
అలాగే.. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్, ట్రాన్స్ కో సీఎండీగా ఉన్న రిజ్విని కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీగా, జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్ గా ఏవీ రంగనాథ్, హెచ్ఎండీఏ కమిషనర్ గా సర్ఫరాజ్ అహ్మద్ లను నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
Also Read: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు