Chiranjeevi with Bandi Sanjay: హైదరాబాద్ వచ్చిన కేంద్రమంత్రి బండి సంజయ్ బిజి బిజీగా ఉన్నారు. కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన, మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఇరువురు నేతలు దాదాపు గంటపాటు చర్చించినట్టు తెలుస్తోంది. అనంతరం చిరంజీవిని కలవడం ఎప్పుడూ సంతోషమేనని, తాను స్టూడెంట్గా ఉన్నప్పుడే ఆయన సినిమాలు చూడడమేకాదు అభిమానుల్లో తాను ఒకరని అంటూ ట్వీట్ చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్.
నిప్పులేనిదే పొగ రాదని, తరచూ బీజేపీ నేతలు చిరును కలవడం పెద్ద కారణాలే ఉన్నాయంటూ పొలిటికల్ సర్కిల్స్లో ఒకటే చర్చ. ఈ మధ్యకాలంలో చిరంజీవిని బీజేపీకి రప్పించేందుకు కమలనాథులు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో పట్టణాల్లో బీజేపీ బలంగా ఉన్నట్లు కనిపించినా, రూరల్లో ఓటు బ్యాంకు లేదు.
ప్రజల్లో కాస్త ఫేమ్ ఉన్న వ్యక్తులను తమవైపు తిప్పుకోవాలని ఆలోచన చేస్తున్నారట. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ నుంచి తెలంగాణ బీజేపీ నేతలు తరచూ కలుస్తున్నారని అంటున్నా రు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని పలుమార్లు చిరంజీవి చెప్పుకొచ్చారు. అయినా బీజేపీ నేతలకు చిన్న ఆశ. ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లోనైనా చిరంజీవి బీజేపీలోకి వస్తారని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్.. మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం
అంతెందుకు.. ఏపీలో జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తరపున ప్రచారం చేయకుండా కేవలం వీడియో సందేశంతో సరిపెట్టారాయన. ఈ లెక్కన తాను రాజకీయాల్లోకి రావడం లేదనే మెసేజ్ని ఇచ్చారని అంటున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.