Indian Army Eagles : దేశ భద్రతలో కుక్కలతో పాటు ఇప్పుడు గద్దలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. బాంబ్ స్క్వాడ్ తనిఖీల్లో శునకాలకు ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాంబు ఎక్కుడున్నా శునకం ఈజీగా పట్టేసి వందల ప్రాణాలను పరోక్షంగా కాపాడుతుంది. ఇప్పుడు తాజాగా గద్దలు భారత సేన్యానికి యుద్ధంలో సహాయపడుతున్నాయి. గాల్లో ఎగిరే శత్రు డ్రోన్లను శిక్షణ తీసుకున్న గద్దలు పట్టుకుకొని కింద పడేస్తాయి.
ప్రస్తుతం భారత్, అమెరికా కలిసి సైనిక కసరత్తులు చేస్తున్నాయి. దీనిలో భాగంగానే డ్రోన్లను ఎగురవేసి గద్దలకు వాటిని పడగొట్టమని ట్రైనింగ్ ఇచ్చారు. శత్రు సైన్యానికి సంబంధించిన డ్రోన్లు ఎగరగానే భారత అప్రమత్తమవుతుంది. అప్పుడే గద్దలకు డ్రోన్లు పడగొట్టడానికి పంపిస్తారు. గద్ద..దూరం నుంచే డ్రోన్లను పసిగట్టి..ఎగిరి వాటిని కాళ్లతో పట్టుకొని కొంత దూరం తీసుకెళ్లి కిందపడవేస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.