EPAPER

PM Modi: పీఎం మోదీతో బంగ్లా ప్రధాని ద్వైపాక్షిక చర్చలు

PM Modi: పీఎం మోదీతో బంగ్లా ప్రధాని ద్వైపాక్షిక చర్చలు

PM Modi: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. సమగ్ర భాగస్వామ్యం ఒప్పందం దిశగా చర్చలు ప్రారంభిచాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో చర్చల అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అన్ని రంగాల్లో రెండు దేశాల సంబంధాలను మరింత విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని నిశ్చయించినట్లు తెలిపారు. భారత్‌కు బంగ్లాదేశ్ అతి పెద్ద అభివృద్ధి భాగస్వామి అన్న ప్రధాని బంగ్లాతో సంబంధాలకు మరింత ప్రధాన్యత ఇస్తామన్నారు.


సైనిక సహకారం, ఆయుధాల ఉత్పత్తి, భద్రతా దళాల ఆధునీకరణపై విస్తృతంగా చర్చించినట్లు ప్రధాని తెలిపారు. తమకు నమ్మకమైన మిత్ర దేశం బంగ్లాదేశ్ అని అన్నారు. 1971లో బంగ్లాదేశ్‌కు భారత్‌తో ఏర్పడిన సంబంధాలకు తాము విలువనిస్తామని తెలిపారు. రైల్వేల అనుబంధం, డిజిటల్, మారిటైమ్ రంగాల్లో సహకారం మరింత విస్తరించే దిశగా భారత్, బంగ్లాదేశ్ ఒప్పందాలు చేసుకున్నాయి. హరిత భాగస్వామ్యంపైన కూడా ఒప్పందాలు చేసుకున్నాయి.

Also Read: నీట్‌ పేపర్‌ లీకేజ్‌పై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం


గత పదేళ్లలో 1965 కు ముందున్న సంబంధాలను పునరుద్ధరించాం అని ప్రధాని మోదీ తెలిపారు. డిజిటల్, ఇంధన రంగాల్లో సంబంధాలకు మరింత ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. దీంతో రెండు దేశాల మధ్య ఆర్థిక వ్యవస్థలు వేగవంతం అవుతాయని తెలిపారు. అంతే కాకుండా బంగ్లాదేశ్‌లోని సిరాజ్ గంజ్‌లో కంటెయినర్ డిపో నిర్మాణానికి భారత్ మద్ధతునిస్తుందని పేర్కొన్నారు.

Tags

Related News

Biryani For Prisoners: మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ – ఖైదీలకు స్పెషల్ మెనూ.. 4 రోజులు పండగే పండుగ!

Maldives Flight Bookings: మల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఆరంభం.. 9 నెలల తర్వాత మళ్లీ దోస్తీ, కానీ..

Naveen Jindal: గుర్రంపై వచ్చి ఓటేసిన నవీన్ జిందాల్, వీడియో వైరల్

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Amethi Family Murder: అమేఠీలో కుటుంబాన్ని హత్య చేసిన సైకో.. హత్యకు ముందే పోలీసులకు సమాచారం… అయినా..

Haryana Elections: హర్యానాలో పోలింగ్ మొదలు.. ఆ పార్టీల మధ్యే ప్రధాన పోటీ, ఫలితాలు ఎప్పుడంటే?

Toilet Tax: ఆ రాష్ట్రంలో టాయిలెట్ ట్యాక్స్ అమలు.. ఇది చెత్త పన్ను కంటే చెత్త నిర్ణయం!

×