Raveena Tandon Controversy : కేజీఎఫ్ యాక్టర్, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కాంట్రవర్సిటీలో చిక్కుకుంది. సోషల్ మీడియాలో తాను చేసిన పోస్టే ఆమెకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. అధికారుల ఆగ్రహానికి గురై.. నోటీసులు ఇచ్చి విచారణ జరిపే వరకు వెళ్లింది మ్యాటర్.
నవంబర్ 22న మధ్యప్రదేశ్లోని సత్పురా టైగర్ రిజర్వ్ సఫారీ టూర్కు వెళ్లింది రవీనా. అక్కడ ఓ పులి కనిపిచ్చే సరికి.. ఆమె ప్రయాణిస్తున్న వాహనం దానికి దగ్గరగా వెళ్లింది. పులిని వీడియోలు, ఫొటోలు తీసి తన ఎక్స్పీరియన్స్ను షేర్ చేస్తూ వీడియోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇలా వెళ్లడం ఆమెను థ్రిల్కు గురి చేసిందేమో కానీ.. అది అధికారుల ఆగ్రహానికి కారణమైంది. రూల్స్కు విరుద్ధంగా టైగర్ దగ్గరికి వాహనం వెళ్లడంపై..అధికారులు విచారణ ప్రారంభించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ ఫారెస్ట్ వెల్లడించారు. ఘటనకు సంబంధించి వాహన డ్రైవర్, అక్కడే ఉన్న అధికారులకు కూడా నోటీసులు జారీ చేసి ప్రశ్నించనున్నారు. తన అనుభవాలను అభిమానులతో పంచుకుందామంటే.. అది కాస్త కాంట్రవర్సీ కావడంతో అయ్యో పాపం రవీనా అంటున్నారు ఫ్యాన్స్.