Medak : మెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు కొద్దిలో పెను ప్రమాదం తప్పిపోయింది. ఆర్టీసీ బస్సు వెళ్తున్న సమయంలో… క్రింది భాగంలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు ఆపి మంటలను ఆర్పివేశారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణీకులు ఉన్నారు. చేగుంట మండలం వడియారం స్టేజ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన బస్సు హైదరాబాద్ నుండి కామారెడ్డి కి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది