Punjab woman dead in US: అమెరికాలో దారుణం జరిగింది. న్యూజెర్సీలో భారత సంతతికి చెందిన మహిళలపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా, ఆమె సోదరికి తీవ్ర గాయాల య్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. రెండురోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..
అమెరికా న్యూజెర్సీలోని మిడిల్ సెక్స్ కౌంటీలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. పంజాబ్కు చెందిన ఇద్దరు మహిళలు జస్వీర్కౌర్, ఆమె సోదరి గగన్దీప్ కౌర్ రోడ్డు పక్కన నడుస్తున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి వీరిపై కాల్పులు జరిపి పారిపోయాడు. జస్వీర్కౌర్ స్పాట్లో మరణించగా, గగన్దీప్ కౌర్ తీవ్రగాయాలు అయ్యాయి.
స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాధితులను ఆంబులెన్స్ సాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే జస్వీర్ కౌర్ మరణించగా, ఆమె సోదరి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. కాల్పులు జరిగిన వ్యక్తి గౌరవ్ కౌర్ కూడా భారతీయుడే. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడ్ని వాషింగ్టన్లో తన ఇంటి వద్దే అరెస్ట్ చేశారు.
ఇదిలావుండగా బాధిత మహిళలు ఇద్దరు నిందితుడికి గతంలో పరిచయం ఉంది. పంజాబ్లో గగన్దీప్ కౌర్, తాను కలిసి చదువుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. అయితే కాల్పులు జరపడానికి కారణాలు తెలియాల్సివుంది. అమెరికాలో పంజాబ్ మహిళను భారతీయుడే చంపడం ఇదే తొలిసారి. గతంలో ఆ తరహా ఘటనలు లేవని అంటున్నారు.
ALSO READ: విమానాన్ని ఢీ కొట్టిన పక్షి, ఇంజన్లో మంటలు.. ఆపై
జస్వీర్కౌర్ న్యూజెర్సీలోని అమెజాన్లో జాబ్ చేస్తోంది. ఆమె భర్త ట్రక్కు డ్రైవర్. ఐదేళ్ల కిందట భర్తతో కలిసి అమెరికా వెళ్లిందామె. ఆమె సోదరి గగన్దీప్ స్టూడెంట్ వీసా మీద అక్కడికి వెళ్లింది.