EPAPER

Swaroopananda’s Security: స్వరూపానంద సెక్యూరిటీ మాటేంటి? కంటిన్యూ చేస్తారా, నెలకు 20 లక్షలా..?

Swaroopananda’s Security: స్వరూపానంద సెక్యూరిటీ మాటేంటి? కంటిన్యూ చేస్తారా, నెలకు 20 లక్షలా..?

Swaroopananda’s Security: వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు భారీగా అవినీతి జరిగిందని టీడీపీ నేతలు పదేపదే చెబుతున్నారు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చింది. గతంలో జరిగిన అనవసర ఖర్చులను బయటకు తీస్తోంది. వైసీపీ నేతలే కాదు, జగన్ సన్నిహితులు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడిపారని పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం ఉంది. అలాంటివారిలో స్వరూపానంద స్వామి ఒకరు.


జగన్‌ను అధికారంలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు చేశారు స్వరూపానంద స్వామి. రిషికేష్ తీసుకెళ్లి ప్రత్యేకంగా అక్కడి పండితులతో హోమాలు చేశారాయన. స్వరూపానంద చేసిన పూజలు ఫలించాయి. అన్నట్లుగానే వైసీపీ అధికారంలోకి వచ్చేసింది. అన్నట్లు స్వామికి చేయాల్సినదంతా చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వం.

ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. వైసీపీ హయాంలో స్వరూపానందకు వై కేటగిరీ భద్రత కల్పించారట. విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్న స్వరూపానందస్వామి పీఠానికి నలుగురు గన్‌మెన్లు, ఆరుగురు సిబ్బందితో పికెట్ నిర్వహించేవారు. ఈ వ్యవహారాలను పర్యవేక్షించడానికి ఓ ఏఎస్ఐ స్థాయిని అధికారిని నియమించారు. తరచూ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడికి వచ్చి స్వామి సేవలో తరించేవారు.


ఈ సౌకర్యాల కోసం ప్రతి నెల ప్రభుత్వం 15 నుంచి 20 లక్షల వరకు కేటాయించినట్టు సమాచారం. అంతేకాదు శారదా పీఠం కోసం ప్రత్యేకంగా కొంత భూమి కూడా కేటాయించినట్టు తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే చాలామంది వైసీపీ నాయకులకు ఈ తరహా సౌకర్యాలు లేవు. తిరుమల వెళ్లినప్పుడు కూడా వీఐపీ తరహాలో స్వామి అక్కడికి వెళ్లివారు. కూటమి అధికారంలోకి వచ్చాక స్వరూపానందస్వామి భద్రతను తొలగించాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఈ లెక్కలు బయటకు తీసే పనిలోపడింది.

ALSO READ: జగన్ ఇంటికి భద్రత, 30 మంది ప్రైవేటు సెక్యూరిటీ

ఎన్నికల ఫలితాలు రాగానే స్వారూపానంద స్వామి మాట మార్చారు. సీఎం చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. తాను ఎవరికీ భయపడి మీడియా సమావేశం పెట్టలేదని, శారదాపీఠంపై తప్పుడు అభిప్రాయాలు వెల్లడించకుండా ఉంటారని వివరించారు. సీఎం చంద్రబాబు అంటే తనకు చాలా గౌరవమని తెలిపారు. ఈసారైనా దేవాలయాల పాలన బాగుండేలా చూడాలని కోరారు. సంపాదన కోసం ఉన్న పీఠం తమది కాదన్నారు. అమరావతిలో శారదా పీఠం నిర్మిస్తామని మనసులోని మాట బయట పెట్టారు స్వరూపానందస్వామి.

Tags

Related News

Jammalamadugu: జమ్మలమడుగులో పొలిటికల్ వార్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య మాటల యుద్ధం..

YS Jagan vs TDP: తొలిసారి నిజాలు చెప్పిన జగన్, అవే మాటలు.. కార్యకర్తలకు బోరు కొట్టకుండా..

Road Accidents in AP: అర్ధరాత్రి రక్తసిక్తమయిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి.. 12 మందికి తీవ్ర గాయాలు!

AP Cyclone warning: దసరా ముసురా? ఆకాశం ముసుగేసింది

Divvela Madhuri: దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్.. తిరుమలలో దివ్వెల మాధురి న్యూసెన్స్ రీల్స్.. కేసు నమోదు

Kiraak RP: నువ్వు ఏ సందులో నుంచి చూశావ్? యాంకర్ శ్యామలపై కిర్రాక్ ఆర్పీ ఫైర్

Guntur BJP Leaders: కొంపముంచిన రాసలీలల వీడియో.. ఇద్దరు కీలక నేతల రాజీనామా!

Big Stories

×