Rishi Sunak : బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన తరువాత బ్రిటన్ అధ్యక్షుడు రిషి సునక్ మొదటిసారి విదేశాంగ విధానంపై మాట్లాడారు. సోమవారం రాత్రి ఆయన పాల్గొన్న ఓ వేడుకలు భారత్తో బ్రిటన్ అనుసరించనున్న విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండోపెసఫిక్ ప్రాంతాలను తక్కువ అంచనా వేయవద్దని అన్నారు. 2050 వరకు సగం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ ఇండోపెసఫిక్ ప్రాంతాలపైనే ఆధారపడి ఉందన్నారు. అందులో ఉత్తర అమెరికా, యూరోప్ విలువ కేవలం 4 శాతం మాత్రమే ఉంటుందన్నారు. ఇండోపెసఫిక్ ప్రాంతాలను పట్టించుకోకపోతే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.
పాలిటిక్స్లో అడుగుపెట్టక ముందు తాను ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టినట్లు చెప్పారు. ఇప్పుడు భారత్, ఇండొనేషియాతో వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు దిశగా బ్రిటన్ ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు.