Maoists Surrender : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 4 మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టులు గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని తమపైనే దాడికి పాల్పడుతున్న కారణంగా లొంగిపోతున్నట్లు మావోయిస్టులు, మడవి మూయ, రవ్వ దేవా, కొవ్వసి గంగ, వందొదూలే చెప్పారు. ఏజెన్సీలో మావోయిస్టులు ప్రజల మద్దతును కోల్పోయినట్లు లొంగిపోయిన దళ సభ్యులు చెబుతున్నారు. గిరిజనులు ఉన్న ప్రాంతంలో ల్యాండ్మైన్స్, ప్రెజర్ మైన్స్ పెట్టి భయానక వాతావరణం సృష్టిస్తున్నారన్నారు. ఇక మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవాలనుకునేవారు ఎస్పీ ఆఫీసులో నేరుగా వచ్చి కలవచ్చని పోలీసులు ప్రకటించారు.