Vizhinjam Police Station Attack : కేరళలోని విళింజం పోలీస్ స్టేషన్పై ఆందోళనకారులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో అనేకమంది పోలీసులతో పాటు మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ స్టేషన్తో పాటు బయట ఉన్నవాహనాలు ధ్వంసమయ్యాయి.దీంతో పోలీసులు..ఈ దాడితో సంబంధం ఉన్న 3వేల మందిపై కేసు నమోదు చేశారు. ఈ మూడువేల మందిలో మహిళలతో పాటు చిన్నారులు ఉన్నారు.
వ్యాపార దిగ్గజ అదానీ గ్రూప్..విళింజిలో పోర్టు అదానీ పోర్ట్ నిర్మాణానికి సమాయత్తమైంది. ఈ నిర్మాణాన్ని విళింజిలోని మత్సకారులు అడ్డుకుంటున్నారు. పోర్టు నిర్మాణం జరిగితే తమ జీవనాధారం కోల్పోతామని మత్సకారులు పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారు. పోర్టు నిర్మాణానికి వస్తున్న భారీ వాహనాలను కూడా ఆందోళనకారులు అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి వచ్చి పరిస్థితి సద్దుమణిగించడంతో యధావిధిగా వాహనాల రాకపోకలు సాగుతున్నాయి.
సూప్రీం కోర్డు కూడా అదానీ గ్రూప్కు మద్దతుగా తీర్పు వెలువరించింది. నిరసనకారుల కీలక నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను విడిపించాలని ఆందోళనకారులు పోలీసులకు విజ్ఘప్తి చేశారు. పోలీసులు విడిపించకపోవడంతో.. ఇనుప రాడ్లతో అనేకమంది విళింజి పోలీస్ స్టేషన్పై అటాక్ చేశారు. ఇక అదానీ గ్రూప్..సుమారు 900 మిలియన్ల డాలర్ల పెట్టబడితో అదానీ గ్రూప్..విళింజి పోర్ట్ నిర్మాణం చేపడుతోందని తెలుస్తోంది.