Srilanka Cricket : శ్రీలంక క్రికెట్ లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒకే రోజు ముగ్గురు క్రికెటర్లు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. పథుమ్ నిస్సంక, కసున్ రజిత, చరిత్ అసలంక…. కొలంబోలోని వేర్వేరు ప్రాంతాల్లో పెళ్లి చేసుకున్నారు. ఈ ముగ్గురు క్రికెటర్ల వివాహాల ఫొటోలను శ్రీలంక క్రికెట్ బోర్డు సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య సిరీస్ జరుగుతుండగానే… ఈ క్రికెటర్లు పెళ్లి బాజాలు మోగించారు. వీరికి శ్రీలంక క్రికెట్ బోర్డు శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక తమ అభిమాన క్రికెటర్లకు పెళ్లిళ్లు కావడంతో ఫ్యాన్స్ ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు