Nellore : నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. దగదర్తి మండలం సన్నబట్టి దగ్గర ఆటోను వెనుక నుంచి వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది . దీంతో ఇద్దరు అయ్యప్ప భక్తులు చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు కూడా ఉన్నారు. కోవూరు మండలం పడుగుపాడు సంఘంలో అయ్యప్ప పూజా కార్యక్రమాన్ని ముగించుకుని వస్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారందర్నీ కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 18 మంది ఉన్నారు.