YS Jagan mohan reddy latest news(AP news live): తెలంగాణలో ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్కు బిగ్ షాక్ తగిలింది. హైదరాబాద్ నగరంలోని లోటస్ పాండ్ నివాసంలో అక్రమ కట్టడాల నిర్మాణంపై జీహెచ్ఎంసీ అధికారులు కొరఢా చూపించారు. ఈ మేరకు జగన్ నివాసంలో చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, ప్రజలకు ఇబ్బందులు కలిగేలా చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Also Read: మీ సేవలు అమోఘం.. తెలుగు ఐఏఎస్ కృష్ణతేజపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసలు
ఫిర్యాదుతో చర్యలు
హైదరాబాద్లోని జగన్ నివాసం ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. అలాగే లోటస్ పాండ్ వద్ద అక్రమంగా నిర్మించిన పోలీస్ సెక్యూరిటీ షెడ్లను జీహెచ్ఎంసీ తొలగించింది. రహదారికి అడ్డుగా ఉన్నాయనే ఫిర్యాదుతో జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు అక్రమంగా నిర్మించిన మూడు షెడ్లను కూల్చేశారు.
లోటస్ పాండ్ వద్ద అక్రమ నిర్మాణాలు తొలగించాలని లోటస్ పాండ్ సిబ్బందికి జీహెచ్ఎంసీ అధికారులు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఉన్నందున కొంతమంది ఫిర్యాదు చేశారని, ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్ : ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటిముందు అక్రమ నిర్మాణాలపై జిహెచ్ఎంసి కొరడా..
లోటస్ పాండ్ జగన్ ఇంటిముందు అక్రమ నిర్మాణాలు కూల్చివేత.
రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో తొలగిస్తున్న జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు.#AndhraPradesh #jaganmohanreddy… pic.twitter.com/GFvui5gHtU
— BIG TV Breaking News (@bigtvtelugu) June 15, 2024