నిజానికి ఈ మర్డర్ కేసులో అనేక ట్విస్ట్లు.. కర్ణాటకలో రేణుకాస్వామి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. విచారణ ప్రారంభమైంది.. అన్ని వేళ్లు దర్శన్వైపు వెళ్లాయి.. ఎందుకు చంపించాడని ఆరా తీస్తే.. పవిత్ర గౌడ పేరు బయటికి వచ్చింది. ఇంతకీ ఎవరీ పవిత్రగౌడ.. దర్శన్ ప్రేయసి.. అఫ్కోర్స్ ఆయనకు ఇంతకుముందే పెళ్లయింది.. పిల్లాడు కూడా ఉన్నాడు. బట్ ఇది వివాహేతర సంబంధం.. ఇదే పెద్ద తప్పు.. ఓకే అది ఆయన పర్సనల్ మనం జడ్జ్ చేయలేం.. కానీ ఆ ప్రేయసిని రేణుకాస్వామి వేధించాడు. ఈ విషయం తెలుసుకున్న దర్శన్ ఏకంగా అతనిపై దాడి చేయించాడు.. ఆ దాడిలో అతను చనిపోయాడు. ఇది ఇప్పటి వరకు ఉన్న వివరాలు.
ఇందులో దర్శన్ చేసిన మొదటి తప్పు.. వేధిస్తున్నాడని తెలుసుకోవగానే తానే చర్యలు తీసుకోవాలని అనుకోవడం.. వెంటనే నలుగురితో అతడిని పిలిపించాడు. మాటలు కాస్త.. దాడుల వరకు వెళ్లింది. ఆ దాడిలో అతను మరణించాడు. మరి నెక్ట్స్ ఏం చేయాలి.. ? ఆ కేసు నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? మళ్లీ ఇక్కడ క్రిమినల్ థింకింగే.. ఓ ముగ్గురిని సెట్ చేశాడు. ఈ హత్య చేసింది తానే అని అంగీకరించేందుకు ఒప్పించాడు. ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. నెక్ట్స్.. తన ఫ్రెండ్ కమ్ కో యాక్టర్ ప్రదోశ్ను సంప్రదించాడు దర్శన్. దీంతో ఈ కేసు మరో టర్న్ తిరిగింది.
ఎవరీ ప్రదోశ్ అనే కదా మీ డౌట్..? ప్రదోశ్ పలు కన్నడ మూవీస్లో యాక్ట్ చేశాడు. దర్శన్తో కలిసి బృందావన, బుల్ బుల్ మూవీస్లో యాక్ట్ చేశాడు. దాని కంటే ముందు ఓ మంత్రి వద్ద పనిచేశాడు ప్రదోశ్.. సో ప్రదోశ్ను కాంటాక్ట్ అయ్యాడు దర్శన్.. ఓ 30 లక్షలు ఇచ్చి మ్యాటర్ను సెటిల్ చేయాలని రిక్వెస్ట్ చేశాడు. దానికి అతను కూడా ఒప్పుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ప్రదోశ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రదోశ్తో కలిపి ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 14కు పెరిగింది. ఈ కౌంట్ ఇంకా పెరిగే చాన్స్ కూడా ఉంది. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.. వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపట్టారు.
Also Read: శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.. ‘కన్నప్ప’ భక్తి చిత్రం ఓ చరిత్ర
ఇదంతా జరుగుతున్న సమయంలో రేణుకాస్వామి అటాప్సీ రిపోర్ట్ బయటికి వచ్చింది. అందులో ఏముంది.. అతడు చనిపోయే ముందు చిత్రహింసలు పెట్టారని తేలింది. మొహంపై దాడి చేశారు. తలకు తీవ్ర గాయమైంది. బాడీలో చాలా చోట్ల ఎముకలు విరిగాయి. ప్రైవేట్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యాయి. ఈ కారణాల వల్లే అతను చనిపోయాడని తేలింది. మరి ఇదంతా చేసింది కావొచ్చు.. చేపించింది కావొచ్చు.. ఎవరు? దర్శన్.. ఈ కేసులో ఏ1 పవిత్ర.. ఏ2 దర్శన్.. ఒక్కసారి సీన్ను ఇలా జరిగితే ఎలా ఉండేదో ఆలోచించండి..ఫస్ట్ సినారియో.. పవిత్రగౌడను రేణుకాస్వామి వేధించాడు.. అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె పోలీసులను ఆశ్రయించింది.. పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేశారు. అక్కడితో అయిపోయింది.
సెకండ్ సినారియో.. పవిత్రగౌడను రేణుకాస్వామి వేధించాడు. ఆమె వెంటనే ఈ విషయాన్ని దర్శన్కు చెప్పింది. దర్శన్, పవిత్రా నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లారు.. కంప్లైంట్ చేశారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.. అక్కడితో అయిపోయింది. ఈ రెండింటిలో ఏది జరిగినా దర్శన్ హాయిగా షూటింగ్ లకు అటెండ్ అయ్యేవారు. పవిత్రా తన పని తాను చేసుకునే వారు.. మిగతా నిందితులు కూడా తమ పని తాము చేసుకునేవారు. కాని వీరు చేసింది ఏంటి. ఇష్యూను వీళ్లే సెటిల్ చేయానుకున్నారు. మొదట కిడ్నాప్ చేశారు. తర్వాత దాడి చేశారు. అది కూడా అత్యంత దారుణంగా కొట్టారు. దెబ్బకు అతను చనిపోయాడు. ఇప్పుడేమైంది.. ఈ సీన్కు ముందు వరకు బాధితురాలిగా ఉన్న పవిత్ర.. మర్డరర్గా మారింది. స్టార్ హీరో.. జైలుకు వెళ్లాడు. తాను తప్పించుకునే క్రమంలో మరో 12 మందిని కూడా జైలుకు చేర్చాడు.
తప్పు చేయడమే తప్పు.. ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు మరికొన్ని తప్పులు చేయడం అనేది ఓ ఊబిలో పడినట్టే.. దాని వల్ల అంతకంతకు లోపలికి కూరుకుపోవడమే తప్ప.. బయట పడే చాన్సే ఉండదు. పుణే యాక్సిడెంట్ కేసులో లాగా కోట్లకు వారసులైనా.. దర్శన్లా కోట్ల మంది అభిమానులున్నా.. ఎవరూ మినహాయింపు కాదు.