Non Bailable Arrest Warrant against Ex CM Yediyurappa: పోక్సో కేసుకు సంబంధించి కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్పకు కోర్టులో చుక్కెదురయ్యింది. బెంగళూరు కోర్టు గురువారం ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను జారీ చేసింది. ఈ కేసు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందంటూ, నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ బాధితురాలి సోదరుడు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంపై విచారణ జరిపిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు తాజాగా ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
Also Read: జాతీయ భద్రతా సలహాదారుగా మరోసారి అజిత్ దోవల్..
17 ఏళ్ల వయస్సు ఉన్న తన కుమార్తెపై యడియూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా సదశివనగర్ పోలీస్ స్టేషన్ లో యడియూరప్పపై పోక్సోతోపాటు పలు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. అనంతరం కొద్ది గంటల వ్యవధిలోనే మార్చి 14న ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.