Congo boat capszed 86 Killed: కాంగోలో విషాదం చోటు చేసుకుంది. ఓ పడవ బోల్తా పడిన ఘటనలో దాదాపు 86 మంది మృతి చెందారు. వంద మందికి పైగానే ఈదుకొంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ ఘటన ఆ దేశ చరిత్రలో అతి పెద్దది. అసలు ఏమైంది?
కాంగో రాజధాని కిన్షాకు సమీపంలోవున్న ఓ నదిలో బోటు ట్రావెల్ చేస్తోంది. అసలే నాటు పడవ, పదుల సంఖ్యలో ఎక్కాల్సిన ప్రయాణికులు పరిమితికి మించి ఎక్కేశారు. ఎంతమందంటే దాదాపు 270 మంది అందులో ప్రయాణిస్తున్నారు. ఓవర్ లోడ్ కారణంగా ఇంజన్లో సమస్య తలెత్తింది. దీని కారణంగా పడవ బోల్తా పడిపోయింది. ఈ ఘటనలో 86 మంది స్పాట్లో చనిపోయారు. వారంతా ఈత రానివారు. మరో 185 మంది ఒడ్డుకు ఈదుకుంటూ తమ ప్రాణాలను కాపాడుకున్నారు. ఇది అధికారులు చెబుతున్న వెర్షన్.
కాంగో పేరు చెప్పగానే దట్టమైన అడవులు గుర్తు కొస్తాయి. అక్కడ అభివృద్ధి అంతంత మాత్రమే. నదుల కారణంగా సరైన రోడ్డు వ్యవస్థ కూడా లేదు. అందుకే అక్కడి ప్రజలు నాటు పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తారు. ఈ క్రమంలో పడవలు బోల్తా పడి పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోయిన సందర్భాలు లేకపోలేదు.
ALSO READ: ఇటలీలో ప్రధాని మోదీ, గాంధీ విగ్రహం.. ఖలిస్థానీ వేర్పాటు వాదులు..
అసలు ఇంజన్ పాడైపోతే పడవ ఆగిపోతుంది. కానీ బోల్తా పడిన ఘటనలు లేవని అంటున్నారు. ప్రమాదం సమయంలో బోటులో ఏమైనా గొడవ జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రాంత ప్రజలు. ఇంతకీ ఈ బోటు ప్రయాణికులను తీసుకుని వెళ్తుందా? లేక పొరుగు దేశం ఎవరైనా వలస వస్తున్నారా? అన్నది విచారణలో తేలాల్సి ఉంది.