Morning Tips: లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఆ తల్లి ఆశీర్వాదం ఉండాలి. ముఖ్యంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఉదయం సమయం చాలా ప్రత్యేకమైనది. ఉదయం పూట సానుకూలతతో నిండి ఉంటుంది. అందువల్ల, ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత లక్ష్మీదేవిని తలచుకున్నా కూడా శుభ ఫలితాలను ఉంటాయని శాస్త్రం చెబుతుంది. అయితే ఉదయం పూట చేసే కొన్ని పనులు తప్పకుండా ఆ వ్యక్తని కోటీశ్వరుడిని చేస్తాయని శాస్త్రం చెబుతుంది. మరి అవేంటో తెలుసుకుందాం.
ఉదయం ఈ సమయంలో మేల్కొనాలి
భగవంతుడిని ఆరాధించడానికి, పూజించడానికి ఉదయం సమయం చాలా పవిత్రమైనది. ఈ సమయంలో హృదయపూర్వకంగా చేసే ఆరాధన ఒక వ్యక్తిని ధనవంతుడిని చేస్తుందని నమ్ముతారు. అందుచేత ప్రతి వ్యక్తి బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. శాస్త్రాల ప్రకారం బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 గంటల నుండి 5.30 వరకు ఉంటుంది. ఈ సమయములో నిద్రలేచి స్నానం ఆచరించాలి. అనంతరం, దేవుడికి పూజలు నిర్వహించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆనందం, శ్రేయస్సు , ఆశీర్వాదాలను పొందుతాడు.
ఈ మంత్రాన్ని జపించండి
కరాగ్రే వసతి లక్ష్మీ, కర మధ్యే సరస్వతీ.
కర్ములే తు బ్రహ్మ, ప్రభాతే కర దర్శనం’
ఉదయం నిద్రలేచిన తర్వాత, ముందుగా అరచేతులను చూసుకోవాలి. శాస్త్రాల ప్రకారం, ఈ మంత్రం అర్థం ఏమిటంటే అరచేతుల కొనలో లక్ష్మీ దేవి, మధ్య భాగంలో సరస్వతి దేవి, మూల భాగంలో విష్ణువు ఉంటారు. నేను వారిని ఉదయాన్నే దర్శిస్తున్నాను. అని ఈ మంత్రం అర్థం.
క్రమం తప్పకుండా ఇలా చేయాలి
ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, స్నానం చేసేటప్పుడు నీటిలో గంగా జలం చల్లుకోవాలి. ఇది ఇంట్లో ఉండే ప్రతికూలతను దూరం చేస్తుంది. అంతేకాదు ఇంట్లో ఆనందం, శ్రేయస్సు వెల్లివిరుస్తుంది. దీనితో పాటు, స్నానం చేసేటప్పుడు పసుపు కూడా చల్లుకోవచ్చు. మతపరమైన దృక్కోణంలో, ఇలా చేయడం చాలా ప్రయోజనకరం.