KTR Hyderabad Metro : హైదరాబాద్లో మెట్రో సెకండ్ ఫేజ్కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. డిసెంబర్ 9న మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. 6250 కోట్ల రూపాయలతో మెట్రో విస్తరణ పనులు చేపట్టనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ మధ్య 31 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మించనున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
మెట్రో రెండో ఫేజ్ పనులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మెట్రో విస్తరణతో హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలు మరింత తగ్గుతాయని భావిస్తున్నారు