40 Indians Killed in Fire Accident in Kuwait: కువైట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ భవనంలో మంటలు చెలరేగడంతో 43 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 40 భారతీయులే కావడం గమనార్హం. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.
కువైట్ లోని అహ్మదీ గవర్నరేట్ లోని మంగాఫ్ బ్లాక్ లో 6 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మరో 30 మంది భారతీయులు గాయపడ్డారు. అక్కడి కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు లేబర్ క్యాంపులోని కింది అంతస్తులోని ఒక వంటగదిలో మంటలు చెలరేగాయి. అవి క్రమంగా అపార్ట్మెంట్ లోని అన్ని గదులకు వ్యాపించాయి.
కొందరు ప్రాణాలను దక్కించుకునేందుకు అగ్నిప్రమాదాన్ని గమనించి బయటకు దూకడంతో మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరికొందరు పొగ పీల్చడంతో, కాలిన గాయాలతో ఊపిరాడక మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారు అదాన్, జాబర్, ముబారక్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం సంభవించిన భవనంలో ఎక్కువగా తమిళనాడు, కేరళ, ఉత్తర భారత ప్రజలు నివసిస్తున్నారు.
Also Read: Congo Boat Capsized 86 People Killed: కాంగోలో పడవ బోల్తా, 86 మంది మృతి.. కారణం అదే..
In connection with the tragic fire-accident involving Indian workers today, Embassy has put in place an emergency helpline number: +965-65505246.
All concerned are requested to connect over this helpline for updates. Embassy remains committed to render all possible assistance. https://t.co/RiXrv2oceo
— India in Kuwait (@indembkwt) June 12, 2024
The fire mishap in Kuwait City is saddening. My thoughts are with all those who have lost their near and dear ones. I pray that the injured recover at the earliest. The Indian Embassy in Kuwait is closely monitoring the situation and working with the authorities there to assist… https://t.co/cb7GHN6gmX
— Narendra Modi (@narendramodi) June 12, 2024
కాగా ఈ ఘటనపై ప్రధాని మోదీ, విదేశాంగ వ్వవహారాల శాఖ మంత్రి జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కువైట్లోని ఇండియన్ ఎంబసీ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని మోదీ ట్వీట్ చేశారు. బాధిత కుటుంబాలకు సాయం అందించేందుకు అక్కడి అధికారులతో కలిసి భారత రాయబార కార్యాలయం కలసి పనిచేస్తోందని పేర్కొన్నారు.