Amit Shah Serious on Tamilisai: సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మరో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. వేదికపై వెంకయ్యనాయుడు, హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా వున్నారు. అదే సమయంలో అటువైపు వస్తూ తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నేత తమిళిసై బీజేపీ పెద్దలకు నమస్కారం చేశారు.
ఈ క్రమంలో తమిళిసైతో అమిత్ షా సీరియస్గానే మాట్లాడినట్టు కనిపించింది. అంతేకాదు ముఖ్యంగా అమిత్ షా వేలు పైకి ఎత్తి చూపి మాట్లాడడంతో ఆమెకు ఏదో వార్నింగ్ ఇచ్చారని చర్చించుకోవడం రాజకీయ నేతల వంతైంది. అప్పటికీ తమిళిసై సరిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ విఫలమైంది.
ఈ వ్యవహారంపై మరో విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడు బీజేపీలో విబేధాలను కమలం పెద్దలు తీవ్రంగా పరిగణించినట్టు కనిపిస్తోంది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై గడిచిన లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు సీటు నుంచి బరిలోకి దిగారు. ఆయన ఓటమిపాలయ్యారు.
Also Read: టెస్లా మాటేంటి? తాను స్వార్థపరుడ్నికాదన్న మంత్రి కుమారస్వామి
ఈ క్రమంలో తమిళిసై వర్గం.. అన్నామలై పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు గతంలో వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెపై అమిత్ షా కాస్త సీరియస్ అయినట్టు చెబుతున్నారు. ఏదేమైనా ఈ వ్యవహారం గురించి తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.
Is it a stern warning for haters of Annamalai?pic.twitter.com/bYI3phJ5XY
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 12, 2024