Telangana TET 2024 Results Released: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET) ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కలిసి ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను schooledu.telangana.gov.inలో చూసుకోవచ్చు. మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకూ నిర్వహించిన టెట్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 2 లక్షల 89 వేల 381 మంది దరఖాస్తు చేసుకోగా.. 2 లక్షల 36 వేల 487 మంది హాజరయ్యారు.
టెట్ పేపర్ – 1కి 99,558 మంది దరఖాస్తు చేసుకోగా.. 86.03 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. అలాగే పేపర్ 2కు 1,86423 మంది దరఖాస్తు చేసుకోగా.. 82.58 మంది హాజరయ్యారు. పేపర్ 1లో 57,725 మంది (67.13) శాతం, పేపర్ -2 లో 51,443 (34.18) శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
Also Read: Telangana govt decision: అధికారుల నిర్లక్ష్యం, స్కూల్స్ ఓపెన్, పుస్తకాలు వెనక్కి..
టెట్ ప్రాథమిక కీ ని అధికారులు ఈ నెల 3న విడుదల చేశారు. టెట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల్లో 20 శాతం మార్కుల వెయిటేజీని డీఎస్సీ నియామకాలకు వర్తిస్తుంది. ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే టీఆర్టీ పరీక్ష రాయాలనుకునేవారు టెట్ లో అర్హత సాధించి ఉండాలి.