2 Killed 1 Injured in Tirupati Road Accident: తిరుపతి జిల్లా పాకాల మండలంలో విషాదం చోటుచేసుకుంది. చిత్తూరు-తిరుపతి హైవే రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు నుంచి తిరుపతి వెళుతున్న లారీని వేగంగా వస్తున్న ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
కాగా, ఏడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలవడంతో అక్కడి స్థానికులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చనిపోయిన వ్యక్తులు ఉత్తరప్రదేశ్కు చెందిన జ్యోతి గోయల్, ఆశీస్సు గోయల్గా గుర్తించారు.
Also Read: పెదకాకానిలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు మృతి
బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ కారును అతివేగంగా నడిపి ముందు వెళుతున్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.