Anchor Anasuya : యాంకర్స్, హీరోయిన్లే అతడి టార్గెట్. సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడం, కామెంట్స్ రాయడమే అతడి పని. ఫేక్ ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, టెలీగ్రామ్ అకౌంట్లు క్రియేట్ చేసి నిత్యం ఇలాంటి పనులు చేస్తున్నాడు. అలాగే యాంకర్ అనసూయ పై పోస్టింగ్ పెట్టాడు. ఈ వ్యవహారంపై నవంబర్ 17న యాంకర్ అనసూయ సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఫోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి ఏపీలోని కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన పందిరి రామ వెంకట వీర్రాజుగా గుర్తించారు.
సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు నిందితుడు రామ వెంకట వీర్రాజును అరెస్ట్ చేశారు. అతడు మూడేళ్లు దుబాయ్ లో ప్లంబర్ గా పని చేశాడు. తర్వాత హైదరాబాద్ వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఫేక్ ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్, టెలిగ్రామ్ అకౌంట్లు క్రియేట్ చేసుకున్న వీర్రాజు అందులో టీవీ యాంకర్లు, సినిమా హీరోయిన్లకు చెందిన ఫొటోలను అప్లోడ్ చేసి అసభ్యకర పోస్టులు పెడుతున్నాడని పోలీసులు నిర్దారించారు. సైబరాబాద్ పోలీసులు వీర్రాజును అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.